కడప జిల్లా.... 1983 వరకు కాంగ్రెస్కు కంచుకోట... తెలుగుదేశం ఆవిర్భావంతో దానికి బీటలు.. ముఖ్యమంత్రి వై.ఎస్. పరివారం గెలుపు మాత్రం అప్రతిహతం.. ఈ ఎన్నికల్లో జగన్ రాజకీయ ప్రవేశం ఆసక్తికరం... అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి తెలుగుదేశం సర్వసన్నద్ధం. పట్టుకోసం ప్రజారాజ్యం విశ్వప్రయత్నం.... తిరుగుబాట్లు, సర్దుబాట్లతో జిల్లా రాజకీయం ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యమంత్రి వై.యస్ . రాజశేఖర రెడ్డి ఆశిస్సులతో కాంగ్రెస్ పార్టీకి ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డి , తెలుగు దేశం తరపున జిల్లా అధ్యక్షుడు ఎస్. రఘురామి రెడ్డి , ప్రజరాజ్యం తరపున ఎంవి రమణా రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.
కడప ముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహనరెడ్డి తన రాజకీయ ప్రవేశంపై సందేహాలు రేకెత్తించారు. ఆయన రావాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు విజయ సంకల్పయాత్ర నిర్వహించాయి. ఆదివారం
ప్రొద్దుటూరు సభలో సస్పెన్స్కు తెరదించి, తనను కడప లోక్సభ స్థానం నుంచి గెలిపించాల్సిందిగా కోరారు. ఇక్కడ పాలెం శ్రీకాంత్రెడ్డి పేరును ఆరు నెలల క్రితమే తెలుగుదేశం సూచనప్రాయంగా ప్రకటించింది. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగే అవకాశాలు లేవని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంలో శ్రీకాంత్రెడ్డి సఫలమయ్యారు. ఐరోపా ప్రజాప్రతినిధుల బృందంతో సర్వే చేయించి ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. ఫలితంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను వీడియో తీయించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
కడప అసెంబ్లీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి బావమరిది, కడప మేయరు రవీంద్రనాథ్రెడ్డి 12న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి, పార్టీపై ఒత్తిడి పెంచారు. టికెట్ మైనార్టీలకు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ప్రరాపా తరఫున మాజీ మంత్రి ఖలీల్బాషా పోటీ దాదాపు ఖరారైంది. తెదేపా తరఫున ఎవరిని బరిలోకి దించుతారన్న అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. కందుల శివానందరెడ్డి, అమీర్బాబు, డాక్టర్ ఉషారాణి, లక్ష్మీరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
పులివెందుల పులివెందులలో ముఖ్యమంత్రి వై.ఎస్. మరోమారు పోటీపడుతున్నారు. తెదేపా తరఫున సతీష్రెడ్డి, ప్రరాపా తరఫున జడ్పీటీసీ సభ్యుడు గంగిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే వై.ఎస్. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీగా నిధులు వెచ్చించి పులివెందుల ప్రాంత రూపురేఖలు మార్చివేశారు. తెలుగుదేశం ప్రారంభమయ్యాక సమీకరణాలు మారినప్పటికీ వై.ఎస్.కుటుంబం హవా మాత్రం తగ్గలేదు.1978, 1983, 1985, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1991, 1996ల్లో ఎంపీగా విజయం సాధించారు. 1989, 1994లో ఆయన సోదరుడు వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా, 1999, 2004లో ఎంపీగా గెలిచారు. 1991 ఉప ఎన్నికల్లో వై.ఎస్. చిన్నాన్న పురుషోత్తం రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం ప్రారంభమయ్యాక సమీకరణాలు మారినప్పటికీ వై.ఎస్.కుటుంబం హవా మాత్రం తగ్గలేదు.1978, 1983, 1985, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1991, 1996ల్లో ఎంపీగా విజయం సాధించారు. 1989, 1994లో ఆయన సోదరుడు వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా, 1999, 2004లో ఎంపీగా గెలిచారు. 1991 ఉప ఎన్నికల్లో వై.ఎస్. చిన్నాన్న పురుషోత్తం రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు
మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎస్.రఘురామిరెడ్డి (తెదేపా), కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది.1983 నుంచి 2004 వరకూ జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ ప్రత్యర్థులుగా పోటీ చేస్తూనే ఉన్నారు. రెండు సార్లు రఘు రామిరెడ్డి, మూడు సార్లు డీఎల్ గెలు పొందారు. ఇక్కడ ప్రజారాజ్యం తరపున జిల్లా కాంగ్రెస్ కోశాధికారి ఐ. తిరుపేల రెడ్డి బరిలోకి దిగుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఓట్లకు గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి.
కోడూరు: అధికారపార్టీ ఎమ్మెల్యే గుంటిప్రసాద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీనివాసులు పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తూమాటి పెంచలయ్య, మాజీ న్యాయమూర్తి జీవరత్నం భార్య ఆదినారాయణమ్మలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. తెదేపా తరఫున ఎర్రకోట జయమ్మ సోదరుడు బాలాజీ, ఉపాధ్యాయుడు అజయ్బాబు రేసులో ఉన్నారు. ప్రజారాజ్యం నుంచి మాజీ మంత్రి సరస్వతమ్మ, రాజశేఖర్ పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి. సరస్వతమ్మకు సీనియర్ నేత సి.రామచంద్రయ్య, స్థానిక నాయకుడు మందల కొండయ్య ఆశీస్సులున్నాయి. రాజశేఖర్కు స్థానికంగా అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి.
రాజంపేట: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ప్రభావతమ్మ, మాజీ ఎమ్మెల్యే మదన్మోహన్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. తెదేపాలో ప్రధానంగా మాజీ మంత్రి బ్రహ్మయ్య, ప్రవాసాంధ్రుడు వేమన సతీష్ మధ్య పోటీ నెలకొంది. ప్రరాపా నుంచి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఎద్దుట సుబ్బరాయుడు, యోగీశ్వరరెడ్డి, తోట మధు, చంద్రశేఖరరాజు, వెంకటయ్య పోటీలో ఉన్నారు.
రాజంపేట లోక్సభ స్థానం కాంగ్రెస్ తరపున ప్రస్తుత ఎంపీ సాయిప్రతాప్ బరిలో ఉన్నారు. తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ప్రరాపా తరపున గునిపాటి రామయ్య, రామచంద్రయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
బద్వేలు: ఈ స్థానాన్ని ఎస్సీ లకు కొత్తగా కేటాయించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కమలమ్మ పేరు అధికారికంగా ప్రకటించారు. తెదేపా నుంచి అమృత్కుమార్ పేరు ఖరారైంది.
ప్రొద్దుటూరు: కాంగ్రెస్ అభ్యర్థి వరదరాజులరెడ్డికి ప్రస్తుత ఎన్నికలు సవాల్ కానున్నాయి. 1985 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన ఈసారి ఎన్నికల్లో ప్రధాన అనుచరుడు రాచమల్లు ప్రసాద్రెడ్డి తెదేపాలో చేరడంతో ఇబ్బందుల్లో పడ్డారు. మరోవైపు ఈయన రాజకీయ ప్రత్యర్థి తెలుగు దేశం అభ్యర్థి మల్లెల లింగా రెడ్డి గట్టిపోటీ ఇవ్వనున్నారు. ఎం.వి.రమణారెడ్డి కుటుంబీకులు ప్రరాపా నుంచి గట్టిపోటీ ఇవ్వనున్నారు.
జమ్మలమడుగు: దేవగుడి ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. తెదేపా మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిని పోటీకి నిలిపింది. ప్రజారాజ్యం నుంచి పోటీకి నాగేంద్ర, రామేశ్వరుడు, చెన్నకేశవరెడ్డి సిద్ధపడుతున్నారు.
రాయచోటి: అధికారపార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి, ఆర్టీసీ మాజీ రీజినల్ ఛైర్మన్ ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి, పీసీసీ సభ్యుడు రాంప్రసాద్రెడ్డి టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. తెదేపా సీనియరు నేత పాలకొండ రాయుడ్ని బరిలోదింపింది. ప్రరాపా నుంచి ఇంకా స్పష్టత లేదు.
కమలాపురంకు సంబంధించి అధికార పార్టీ తరపున వీరశివారెడ్డి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెదేపా అభ్యర్థిత్వం ఆయనకే దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో సొంత మండలం ఎర్రగుంట్ల జమ్మలమడుగులో చేరడంతో సీనియరు నేత మైసూరారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సేవలను పార్టీ పటిష్టతకు ఉపయోగించుకోవాలని అధినేత బాబు యోచిస్తున్నారు. ప్రరాపా తరపున బలమైన అభ్యర్థి ఎవరూ బరిలో లేరు.
విశేషాలు
- 1952లో కె.కోటిరెడ్డి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 ఓట్లు, 1967లో ఎన్.పుల్లారెడ్డి కమలాపురం నుంచి 86 ఓట్లు, 1994లో మైదుకూరు నియోజకవర్గం నుంచి డీ.ఎల్ రవీంద్రారెడ్డి 28 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.
- 1991 ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి వై.ఎస్. పురుషోత్తంరెడ్డి 87,448 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
- 1991లో వైఎస్ రాజశేఖరరెడ్డి కడప లోక్సభ నుంచి 4,22,790 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 5,445 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
- 1972లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎస్పీ నాగిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 1957లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్కు చెందిన టి.ఎన్.వి.రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- కడప కోటిరెడ్డి మద్రాసు ప్రభుత్వంలో దేవాదాయమంత్రిగా పనిచేశారు. దళితులకు ఆలయప్రవేశం కల్పించారు.